Anchor Rashmi Gautam : రష్మీ గౌతమ్ మీద సోషల్ మీడియా సమరం కొనసాగుతుంది. తనకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా బాలుడి మరణం విషయంలో టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై తమ అసహనం బయటపెడుతున్నారు. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన రష్మీని చిక్కుల్లోకి నెట్టింది. చాలా కాలంగా రష్మీ వీధి కుక్కలకు మద్దతుగా పోరాడుతున్న తరుణంలో ఆమెను జనాలు ఏకి పారేస్తున్నారు. రష్మీ వంటి యానిమల్ లవర్స్ వీధి కుక్కల విషయంలో అధికారులను తమ పని చేసుకోనివ్వడం లేదనేది ప్రధాన ఆరోపణ. గతంలో జనం అభ్యర్ధన మేరకు మున్సిపాలిటీ సిబ్బంది వీధి కుక్కలను బంధించి జనావాసాలకు దూరంగా విడిచిపెట్టేవారు.
దాన్ని హింసగా పరిగణించి పెటా చట్టాలు, బ్లూ క్రాస్ సంస్థలు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుండా అడ్డుకుంటున్నారు. యానిమల్ లవర్ గా రష్మీ సైతం ఇదే చేస్తుంటారు. ఎవరైనా వీధి కుక్కల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిస్తే… ఫిర్యాదు చేస్తారు. అలాగే రష్మీ సోషల్ మీడియాలో మూగజీవాలను హింసించవద్దంటూ క్యాంపైన్ చేస్తూ ఉంటారు. ఈ చర్యల కారణంగా రష్మీ సాధారణ జనాల ఆగ్రహానికి గురయ్యారు.
అందుకే ఆమెను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల కొందరు నెటిజెన్స్ ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి రష్మీని బెదిరిస్తూ సందేశాలు పంపాడు. నీకు చేతబడి చేయిస్తా, బయట తిరిగితే యాసిడ్ పోస్తా అంటూ భయాందోళనలకు గురి చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ రష్మీ ట్విట్టర్లో షేర్ చేశారు.
తాజాగా ఓ వ్యక్తి రష్మీని జైల్లో పెట్టాలని కామెంట్ చేశాడు. వీధి కుక్కలకు ఆహారం పెడుతూ రష్మీ వాటిని ప్రోత్సహిస్తోంది. ఈ కారణంగా ముందు రష్మీని జైల్లో పెట్టాలని ట్వీట్ చేశాడు. సదరు ట్వీట్ కి స్పందించిన రష్మీ… కరుకైన సమాధానం చెప్పింది. అది మీ వల్ల కాదు. ఏం కావాలంటే అది చేసుకో, అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. గత వారం రోజులుగా నాన్ స్టాప్ గా రష్మీని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఆమె కూడా తగ్గడం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా నా మద్దతు వీధి కుక్కలకే అని నిర్మొహమాటంగా చెబుతుంది.
ఇక ఈ గొడవ ఎంత దూరం వెళుతుందో చూడాలి. మరోవైపు వీధి కుక్కల దాడిలో మరణించిన బాలుడి తరపున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోరాటం చేస్తున్నారు. పెద్ద లాయర్ ని నియమించాడు. పిల్లాడి తండ్రి అకౌంట్ డిటైల్స్ షేర్ చేసి, అతనికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన అనంతరం జిహెచ్ఎంసి వీధి కుక్కలను అదుపు చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది.
Give it your best shot https://t.co/c5qAj9VaAm
— rashmi gautam (@rashmigautam27) March 2, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Demand to arrest anchor rashmi gautam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com