
ఈ భూ ప్రపంచంలో మనకు అర్థం కాని మిస్టరీలు ఎన్నో ఉంటాయి. కొన్ని విషయాల గురించి వింటే ఇలా కూడా జరుగుతుందా…? అని పలు సందర్భాల్లో ఆశ్చర్యపోతూ ఉంటాం. అదే విధంగా ఇంగ్లండ్ లోని ఒక కుర్చీ వెనుక సైతం ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ గురించి తెలిస్తే ఆసక్తితో పాటు భయం కూడా కలుగుతుంది. ఇంగ్లండ్ లోని ఒక కుర్చీలో ఎవరైతే కూర్చుంటారో వారు కూర్చున్న కొన్ని రోజులకే వేర్వేరు కారణాల వల్ల మృతి చెందారు.
Also read: ఆ వయసు ఉన్నవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్!
వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా వరుస మరణాలు ఈ కుర్చీ సాధారణ కుర్చీ కాదని డెత్ కుర్చీ అని ప్రజలు నమ్మేలా చేస్తున్నాయి. వివిధ కాలాల్లో 200 మంది ఈ కుర్చీపై కూర్చోగా వాళ్లంతా మరణించడం గమనార్హం. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లోని త్రిస్క్ అనే ప్రాంతంలో చిల్లర దొంగగా జీవనం సాగిస్తున్న డానియల్ ఔటి అనే వ్యక్తి కూతురు ఎలిజబెత్ కు థామస్ బస్సే అనే వ్యక్తితో వివాహం జరిగింది.
Read also: షాకింగ్: పొగ తాగేవారికి 28 రకాల జబ్బులు!
వివాహం అనంతరం ఎలిజబెత్, థామస్ మధ్య తరచూ ఒక కుర్చీ కోసం గొడవలు జరుగుతుండేవి. గొడవలు పెద్దవి కావడంతో డానియల్ తన కూతురుకు పుట్టింటికి తీసుకెళ్లాలని వచ్చి గొడవకు కారణమైన కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ వల్ల మామ డానియల్ కు అల్లుడు థామస్ కు జరిగిన గొడవలో థామస్ డానియల్ ను చంపేశాడు.
Read also: ‘చికెన్’లో కరోనా.. బయటపడ్డ షాకింగ్ నిజం.. ఎక్కడంటే?
అనంతరం కోర్టు ఉరిశిక్ష విధించగా థామస్ చివరి కోరికగా ఆ కుర్చీపై కూర్చుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తరువాత ఒక హోటల్ ఆ కుర్చీని తీసుకుంది. అప్పటినుంచి ఆ కుర్చీపై కూర్చున్న 200 మంది వివిధ కారణాల వల్ల మృతి చెందడంతో ఆ కుర్చీకి డెత్ చైర్ గా పేరు వచ్చింది. హోటల్ సిబ్బంది భయపడి ఒక మ్యూజియంకు ఆ చైర్ ను అందించగా మ్యూజియం సిబ్బంది సైతం భయపడి కుర్చీని గోడకు వేలాడదీసినట్టు అధికారులు చెబుతున్నారు.