Anasuya Bharadwaj: హైదరాబాద్ భారీ స్కోర్ వెనక అనసూయ హస్తం ఉందా.. వీడియో వైరల్

ఈ మ్యాచ్లో తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముందుగా బౌలింగ్ కు అనుకూలించిన ఈ మైదానంపై తన దూకుడైన ఆటతీరుతో భారీగా పరుగులు రాబట్టాడు. హెడ్, క్లాసెన్ తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 3, 2024 2:11 pm

Anasuya Bharadwaj

Follow us on

Anasuya Bharadwaj: ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో.. హైదరాబాద్ విజయం సాధించింది. గురువారం రాత్రి హైదరాబాద్ వేదికగా ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఈ స్థానంలో చెన్నై జట్టు ఉండేది. రాజస్థాన్ జట్టుపై సాధించిన విజయం ద్వారా హైదరాబాద్ చెన్నై జట్టును దాటేసి నాలుగవ స్థానానికి వెళ్లిపోయింది. ఈ విజయం ద్వారా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గత కొన్ని సీజన్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న హైదరాబాద్.. ఈ సీజన్లో మాత్రం టాప్ – 4 లో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్లో తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముందుగా బౌలింగ్ కు అనుకూలించిన ఈ మైదానంపై తన దూకుడైన ఆటతీరుతో భారీగా పరుగులు రాబట్టాడు. హెడ్, క్లాసెన్ తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 76 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. హైదరాబాద్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సొంత మైదానంలో ఆడటంతో … హైదరాబాద్ జట్టు గెలుపును కాంక్షిస్తూ వేలాదిమందికి ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. అందులో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. వారంతా హైదరాబాద్ జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఫోర్లు, సిక్స్ లు కొడుతుంటే మైదానంలో సందడి చేశారు. హైదరాబాద్ జెర్సీలు ధరించి మైదానాన్ని హోరెత్తించారు.

ఇక ఈ మ్యాచ్ కు ప్రముఖ టాలీవుడ్ నటి, జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ తన భర్త, పిల్లలతో కలిసి హాజరైంది. హైదరాబాద్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎగిరి గంతేసింది. స్లీవ్ లెస్ షర్ట్ వేసుకొని వచ్చి మైదానంలో సెగలు పుట్టించింది. అనసూయ అరుస్తున్నంత సేపు.. పక్కన ఉన్న ఇతర ప్రేక్షకులు కేకలు పెట్టారు. హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు భారీ స్కోరు చేయాలని అనసూయ ఎంకరేజ్ చేసింది. ఆమె ఎంకరేజ్ చేసే క్రమంలో గోల గోల చేసింది. పక్కన పిల్లలు, భర్త ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి.. హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల బ్యాటింగ్ ను ఓ ప్రేక్షకురాలిగా ఆస్వాదించింది. మొదట్లో హైదరాబాద్ ఆటగాళ్లు తక్కువ స్కోరు చేయడంతో అనసూయ డీలా పడిపోయింది. ఆ తర్వాత హెడ్, నితీష్ రెడ్డి ధాటిగా ఆడటంతో అనసూయ ముఖంలో కళ వచ్చింది. అరుపులతో మైదానాన్ని హోరెత్తించింది. అయితే అనసూయ అరుస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం అది ట్రెండింగ్ గా మారింది. అనసూయ అలా అరవడం వల్లే హైదరాబాద్ భారీ స్కోరు సాధించిందని నెటిజెన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.