Kurchi Thatha Death: అప్పట్లో సోషల్ మీడియాలో కుర్చీ మడత పెట్టి తాత కొద్ది రోజులపాటు సంచలనం సృష్టించాడు. ఏకంగా అతని మీద గుంటూరు కారం సినిమాలో ఒక పాట కూడా రూపొందించారు. ఆ పాట యూట్యూబ్లో కొన్ని కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. మహేష్ బాబు సినీ కెరియర్ లోనే హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా అది రికార్డు సృష్టించింది.
ఆ పాట రూపొందించడానికి ప్రధాన కారణమైన కుర్చీ తాత అలియాస్ మహమ్మద్ పాషా కన్నుమూశారు. మహమ్మద్ పాషా వయసు 64 సంవత్సరాలు. ఇన్ హైదరాబాద్ నగరంలోని కృష్ణకాంత్ పార్క్ లో మంగళవారం ఉదయపు నడక నడుస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వడదెబ్బ వల్ల ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కుర్చీ తాత అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బ వల్ల కొంతమేర ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో కూడా చూపించారు. అయితే మార్నింగ్ వాక్ చేస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. చాతిలో నొప్పి వస్తుందని చెప్పుకుంటూనే కన్నుమూశారు.
కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా విపరీతంగా ఎండలు నమోదు అవుతున్నాయి. దీనివల్ల చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్దలు, వృద్ధులు, చిన్నారులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా వడదెబ్బతో చనిపోయే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. అందువల్లే ఎండాకాలంలో ముఖ్యంగా ప్రస్తుత కాలంలో బయటికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల అకస్మాత్తుగా గుండెపోటు మరణాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కుర్చీ తాత కూడా అలానే చనిపోయాడు. ఆయన మరణం పట్ల చుట్టుపక్కల వారు సంతాపం వ్యక్తం చేశారు.
కుర్చీ తాత ఆరోగ్యంగానే ఉండేవారు. ఆయనకు ఆగ్రహం ఎక్కువ. పైగా సమాజంలో పెడపోకడల మీద ఆయన తనదైన శైలిలో స్పందించేవారు. అందువల్లే అప్పట్లో యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కుర్చి మడత పెట్టి.. అనే పదాన్ని వాడారు. అది కాస్త విపరీతంగా సర్కులేట్ అయింది. ఎవరికి మహమ్మద్ భాషను సోషల్ మీడియా స్టార్ ను చేసింది. వ్యూస్ కోసం ఆయనను వాడుకున్న సినిమా వాళ్లు.. యూట్యూబర్లు తర్వాత పట్టించుకోలేదు. కొన్ని సందర్భాలలో కుర్చీ తాత పలు ప్రాంతాల్లో కనిపించారు.
