HomeతెలంగాణThorrur Municipal Election Results: అక్కడ కారు పార్టీ గెలిచింది.. అత్తా కోడళ్ళ కు షాక్...

Thorrur Municipal Election Results: అక్కడ కారు పార్టీ గెలిచింది.. అత్తా కోడళ్ళ కు షాక్ తగిలింది

Thorrur Municipal Election Results: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. అయితే అక్కడక్కడ కారు పార్టీ సంచలన విజయాలను నమోదు చేస్తోంది. కారు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన మున్సిపాలిటీ స్థానాలలో తొర్రూరు ఒకటి.

తొర్రూరు మున్సిపాలిటీ పాలకుర్తి నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో 2023లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే దయాకర్ రావు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించింది. ఆమె గెలుపులో అత్త ఝాన్సీ రెడ్డి కీలకపాత్ర పోషించారు.

యశస్విని గెలుపు ద్వారా రేవంత్ రెడ్డి ఒకరకంగా దయాకర్ రావు మీద రివెంజ్ తీర్చుకున్నట్టు అయింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత యశస్విని రెడ్డి మొదట్లో నియోజవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేశారు. కాలక్రమంలో పార్టీలో అంతర్గత పోరు పెరిగిపోయింది. దీనికి తోడు ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలి కొంతమంది నాయకులకు మింగుడు పడని విధంగా మారిపోయింది.

మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి విషయంలో ఝాన్సీ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకరకంగా పార్టీలో ఉన్న అంతర్గత పోరును బయటపెట్టింది. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలి అని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను పక్కన పెట్టడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని తెలుస్తోంది.

మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇందులో 10 వార్డులను గులాబీ పార్టీ గెలుచుకుంది. ఆరు వార్డులను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. తద్వారా మున్సిపల్ పీఠాన్ని గులాబీ పార్టీ అధిరోహించబోతోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ విజయం సాధించడం గమనార్హం.

ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి కి ఈ ఫలితాలు ఒకరకంగా షాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా పార్టీలో ఉన్న అంతర్గత పోరును పరిష్కరించడానికి వారిద్దరు ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ ఫలితాలతోనైనా ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి కళ్ళు తెరవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular