HomeతెలంగాణTelangana Corruption Cases: ఆరు నెలల్లో ఇన్ని కేసులా.. తెలంగాణలో ప్రభుత్వ అధికారుల అవినీతి ఏ...

Telangana Corruption Cases: ఆరు నెలల్లో ఇన్ని కేసులా.. తెలంగాణలో ప్రభుత్వ అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందంటే..

Telangana Corruption Cases: అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చేస్తోంది. అన్ని శాఖల అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నది. భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నది. కేసులు కూడా అదే స్థాయిలో నమోదు చేస్తున్నది. అయినప్పటికీ అధికారులు ఒక లంచాలు తీసుకోవడం మానివేయడం లేదు. పైగా లంచాల కోసం ప్రజలను వేధిస్తున్నారు. తమ పని కోసం వచ్చిన పెద్ద పెద్ద వ్యక్తులను సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. చివరికి అవినీతి నిరోధక శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్లలో చిక్కుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి నిరోధక శాఖకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చింది. ఎటువంటి అధికారి అయినా సరే అవినీతి కేసులో ఇరుక్కుంటే తొక్కి నార తీయండి అని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు అత్యంత స్వేచ్ఛగా పనిచేస్తున్నారు.

Also Read: కవిత సీఎం అవుతుందట.. కేటీఆర్ కు ఎసరు పెట్టినట్టే?

ఈ ఏడాది మొదటి నెల నుంచి గడచిన నెల వరకు మొత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకంగా 126 కేసులు నమోదు చేశారు. ఇందులో ట్రాప్ కేసులు ఎనిమిది ఉన్నాయి. ఆదాయానికి మించిన కేసులు ఎనిమిది ఉన్నాయి. క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు 14 ఉన్నాయి. 11 సర్ప్రైజ్ చెకింగ్ లు, డిస్కీట్ ఎంక్వైరీలు మూడున్నాయి. ఈ ఆరు నెలల కాలంలో మొత్తం ఎన్ని మంది ప్రవేటు వ్యక్తులను కలుపుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులు మొత్తం 125 మందిని అరెస్టు చేశారు.. వారందరినీ కూడా జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు ట్రాప్ కేసులలోనూ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 27,66,60,526 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ ఆరు నెలల కాలంలో 129 కేసులలో తుది నివేదికలను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు..

క్రితం నెలలో కూడా రోజుకు ఒకటి చొప్పున కేసులు నమోదు కావడం విశేషం. ఆదాయానికి మించిన కేసులు ఇందులో రెండు ఉండగా.. ట్రాప్ కేసులు 15 ఉన్నాయి.. క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు మూడు ఉండగా.. రెగ్యులర్ ఎంక్వయిరీలు నాలుగు ఉన్నాయి.. సర్ప్రైజ్ చెకింగ్ లు ఏడున్నాయి.. ఇక రవాణా శాఖ కార్యాలయాలపై ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా.. దాదాపు మూడు కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఇక రవాణా శాఖ కార్యాలయాలపై సోదాలకు సంబంధించిన నివేదికను కూడా అవినీతి నిరతక శాఖ పంపించింది. ఇక గడిచిన నెలలో నమోదు చేసిన 11 కేసులలో తుది నివేదికలను అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి పంపించారు.

Also Read: నిజంగా కేసీఆర్‌ సాధించాడు.. కాంగ్రెస్‌ నమ్మాలి.. నడిపించాలి

అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నప్పటికీ.. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నప్పటికీ లంచగొండి సిబ్బంది మారడం లేదు. పైగా లంచాల కోసం ప్రజలను వేధిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి ఏసీబీ ట్రాప్ లో దొరికిపోయారు. అతడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆ మండల ప్రజలు రెవెన్యూ కార్యాలయం ఎదుట బాణ సంచా పేల్చడం విశేషం. దీనిని బట్టి ప్రభుత్వాధికారులు ఏ స్థాయిలో లంచాలకు అలవాటుపడ్డారో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version