HomeతెలంగాణBandi Sanjay : సంజయే సారధి.. ఇక తేల్చుకోవాల్సింది వారే! 

Bandi Sanjay : సంజయే సారధి.. ఇక తేల్చుకోవాల్సింది వారే! 

Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో నెలకొన్న సంక్షోభానికి తెరదించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. క్రమశిక్షణ గల పార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీలో వలస నేతల కారణంగా సంక్షోభం మొదలైంది. దీంతో ఒక్కసారిగా పార్టీలో దూకుడు తగ్గింది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి పార్టీలో నెలకొనడం అధిష్టానానికి కాలిలో ముల్లులా మారింది. ఈ విషయాన్ని ఇంకా నాన్చడం మంచిది కాదని భావించిన అధిష్టానం అసమ్మతి నేతలకు చెక్‌పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడిని మార్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇక తేల్చుకోవాల్సింది అసమ్మతి నేతలే అన్న సంకేతాలు ఇచ్చింది.
సంజయ్‌ని మార్చాలని.. 
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు కోసం పార్టీలో కొన్నాళ్లుగా ఒత్తిడి పెరుగుతోంది. ఈమేరకు ప్రచారం కూడా ఊపందుకుంది. సంజయ్‌ వ్యతిరేకవర్గం ఈమేరకు అధిష్టానంపై ఒత్తిడి కూడా చేసింది. దీంతో ఇక మార్పు తప్పదు అన్నట్లుగా ప్రచారం జరిగింది. మరోవైపు ఈటల రాజేందర్‌ను అధిష్టానం రెండు మూడుసార్లు ఢిల్లీకి పిలిపించడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే ఈ ప్రచారానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ చెక్‌పెట్టారు. అధ్యక్షుడి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. నచ్చినవాల్లు ఉండొచ్చు.. నచ్చని వాళ్లు వెళ్లిపోవచ్చు అన్నట్లుగా అధిష్టానమే ఈ ప్రకటన చేయించిందని తెలుస్తోంది.
వలస నేతలతో ఇబ్బంది.. 
బీజేపీ గడిచిన మూడేళ్లలో బాగా బలపడింది. సంజయ్‌ అధ్యక్షుడు అయ్యాక గతంలో ఎన్నడూ లేనంతాగా ప్రజల్లోకి వెళ్లింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలవడంతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించినంత పనిచేసింది. మరోవైపు సంజయ్‌ పాదయాత్రతో పార్టీని ప్రజలకు చేరువ చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు కీలక నేతలు పార్టీలో చేరారు. అయితే వీరంతా ఢిల్లీలోనే పార్టీ కండువాలు కప్పుకున్నారు. తాజాగా సంజయ్‌ పదవీకాలం ముగియడంతో ఆయనను మార్చి తమలో ఒకరికి పగ్గాలు ఇస్తారని భావించారు. ఇందులో ఈటల రాజేందర్‌ ముందు వరుసలో ఉన్నారు. సంజయ్, ఈటల వర్గాలుగా నేతలు విడిపోయి సంజయ్‌ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పార్టీలో కొన్ని రోజులుగా అంతర్గత సంక్షోభం నెలకొంది.
‘బండి’కి వ్యతిరేకంగా నివేదికలు
బండి సంజయ్‌కుపై ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి నివేదికలు కూడా అందించింది. పార్టీని ఇష్టారీతిన నడుపుతున్నారని, నాయకులను పట్టిచంకోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పూర్తి స్తాయిలో మత ప్రస్తావన తెస్తూ.. బీజేపీకి చేటు చేస్తున్నారని నివేదికలు సమర్పించారు. ఈ కారణంగానే పార్టీలో చేరికలు ఉండటం లేదన్నారు.
మార్చాలని ఆలోచన చేసినా..
పార్టీలో పరిస్థితిపై ఇటీవల వరుస సమీక్షలు నిర్వహించిన అధిష్టానం అధ్యక్షుడి మార్పుపై పునరాలోచన చేసింది. ఒక దశలో మార్చలని నిర్ణయానికి కూడా వచ్చినట్లు ప్రచారం జరిగింది. బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని తెలంగాణ చీఫ్‌గా ఈటలను చేస్తారని లీకులు వచ్చాయి. అయితే మొదటి నుంచి పార్టీలో పనిచేసేవారిని కాదని, వలస నేతలకు పగ్గాలు ఇస్తే పార్టీ కోసం పనిచేసేవారు ఇబ్బంది పడతారని భావించింది. దీంతో మార్పు లేదని స్పష్టం చేసింది. దీంతో ఇక తేల్చుకోవాల్సింది వలస నేతలు, బండి వ్యతిరేకులే..
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular