Homeటాప్ స్టోరీస్Telangana Congress : రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి సీక్రెట్ మీటింగ్?

Telangana Congress : రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి సీక్రెట్ మీటింగ్?

Telangana Congress : కాంగ్రెస్‌ అంటేనే కలహాల పార్టీ. ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్వలేరు. అనైక్యత కారణంగా పదేళ్లు తెలంగాణలో అధికారానికి దూరమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా.. దానిని నిలబెట్టుకోవడం ఓ సవాల్‌గా మారింది. ఏడాదిపాటు పాలన సాఫీగా సాగింది. ఇప్పుడు అంతర్గత కలహాతో సతమతమవుతోంది. మంత్రివర్గ విస్తరణ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తికి కారణమైంది. అది క్రమంగా పార్టీ చీలికకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం గురించి ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా సమాచారం రేవంత్‌ రెడ్డికి చేరడంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది.

అసంతృప్తికి కారణాలు ఏమిటి?
కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తికి ప్రధాన కారణం మంత్రి పదవి రాకపోవడం. 2023లో రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి చేరినప్పుడు, మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, 2023 డిసెంబర్‌లో, 2024 జూన్‌లో కేబినెట్‌ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో, రాజగోపాల్‌ రెడ్డి రేవంత్‌ రెడ్డి నాయకత్వ శైలిని, ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, తీవ్ర విమర్శలు చేశారు. ఈ అసంతృప్తే రహస్య సమావేశానికి దారితీసినట్లు తెలుస్తోంది.

రహస్య సమావేశం..
రెండు రోజుల క్రితం జరిగిన ఈ రహస్య సమావేశంలో 25 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశం గురించి ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా సమాచారం రేవంత్‌ రెడ్డికి చేరడంతో, పార్టీలో అప్రమత్తత నెలకొంది. రాజగోపాల్‌ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది, ఇది పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలకు దారితీస్తోంది. గతంలో కూడా కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు రాజగోపాల్‌ రెడ్డి తన సోదరుడు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సహాయం కూడా పొందలేకపోయారు, దీనివల్ల ఆయన అసంతృప్తి మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశమైనట్లు వార్తలు రావడం, ఢిల్లీలో ఉన్నట్లు తెలియడం పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరుగుతున్నాయనే అనుమానాలను రేకెత్తిస్తోంది.

రాజకీయ సంక్షోభం తప్పదా?
ఈ రహస్య సమావేశం తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం ఉంది. రాజగోపాల్‌ రెడ్డి గతంలో బీజేపీలో చేరిన చరిత్ర ఉన్నందున, ఆయన మళ్లీ పార్టీ మారతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఆయన తన నియోజకవర్గం మునుగోడు కోసం పోరాడుతానని, అవసరమైతే మళ్లీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతానని పేర్కొన్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి సవాల్‌గా మారనున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. కమిటీ చైర్మన్‌ మల్లు రవి, రాజగోపాల్‌ రెడ్డితో మాట్లాడి, విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular