spot_img
Homeతెలంగాణభర్త పేరు మీద కోట్లలో ఇన్సూరెన్స్.. ప్రియుడితో కలిసి దారుణం.. నిజామాబాద్ సౌమ్య కేసులో దిగ్భ్రాంతికర...

భర్త పేరు మీద కోట్లలో ఇన్సూరెన్స్.. ప్రియుడితో కలిసి దారుణం.. నిజామాబాద్ సౌమ్య కేసులో దిగ్భ్రాంతికర వాస్తవాలు!

Nizamabad Soumya Case: భర్తను కొంతమంది వ్యక్తులు, ప్రియుడితో కలిసి చంపించింది. ఆ తర్వాత అతడికి గుండెపోటు అని ప్రచారం చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో.. ఆమెను, ఆమె ప్రియుడిని, ఈ హత్య కేసులో పాలుపంచుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని నిజాలు రాబట్టడానికి పోలీసులు విచారణ చేస్తుంటే.. షాకింగ్ పరిణామాలు ఎదురవుతున్నాయి.

నిజామాబాదులో భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య సౌమ్య.. భర్త రమేష్ పై రెండు కోట్లకు పైగా జీవిత బీమా చేయించింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే సౌమ్య తన భర్త రమేష్ హత్యకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ప్రియుడు దిలీప్ సహకారం తీసుకుంది. పైగా తమ వివాహేతర సంబంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని.. అతడిని అంతం చేయాలని సౌమ్య గట్టిగా నిర్ణయించుకుంది. ప్రియుడు దిలీప్, కిరాయి హంతకులతో భర్తను చంపేసిన తర్వాత.. బీమా డబ్బుల కోసం సాధారణ గుండెపోటు అని చిత్రీకరించింది. నిద్ర మాత్రలు ఇచ్చి భర్త గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత అతడికి గుండెపోటు వచ్చిందని నమ్మించింది. రమేష్ తమ్ముడు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అతడి మృతదేహానికి రి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోలీసుల విచారణలో సౌమ్య అసలు నిజం చెప్పడంతో.. దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని కూడా విచారించగా.. అసలు నిజాలు బయటపెట్టాడు.

నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాం గ్రామానికి చెందిన రమేష్ తన భార్య సౌమ్య, పిల్లలతో కలిసి నివాసం ఉండేవాడు. సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ గా పని చేసేది. ఇదే పాఠశాలలో పి ఈ టిగా పని చేస్తున్న దిలీప్ తో ఆమెకు సంబంధం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. ఈ విషయం రమేష్ కు తెలిసింది. దీంతో అతడు ఆమెను నిలదీశాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడు దిలీప్ తో ప్రణాళిక రూపొందించింది. గత నెల సౌమ్య తన ప్రియుడు దిలీప్ తో కలిసి రమేష్ ను ఇంట్లోనే హత్య చేసింది. తన భర్తకు గుండెపోటు అని నమ్మించింది. ఎవరికి ఎటువంటి అనుమాన రాకుండా అంత్యక్రియలు జరిపింది. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో రమేష్ మెడ మీద గాట్లు కనిపించాయి. వాటిని స్థానికులు గమనించారు. వెంటనే ఇజ్రాయిల్ ప్రాంతంలో ఉన్న రమేష్ తమ్ముడు కేదారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో అతడు అక్కడే ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రమేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. రీ పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper