KTR strong warning to Pawan Kalyan: గత కొద్దిరోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. అనవసరంగా ఆయన్ని గెలుకుతూ , మేధావుల ముసుగులో కొంతమంది విశ్లేషకులు పుట్టించిన పుకార్ల నుండి ఈ వివాదం మొదలైంది. తర్వాత ఆ ప్రముఖ మేధావి విశ్లేషకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు అధికారిక ప్రకటన చేసి క్షమాపణలు చెప్పడం , అక్కడితో ఆగకుండా సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ మీద ముప్పేట దాడి చేస్తూ ప్రెస్ మీట్ ని నిర్వహించడం , ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా , నవ తెలంగాణ నిర్మాణ సభ ని ఏర్పాటు చేయడం , అందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం వంటివి పొలిటికల్ హీట్ ని తారా స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి.
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కూడా , పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , తెలంగాణ లో తనని అడుగుపెట్టనివ్వం అంటూ ప్రగల్భణాలు పలికిన కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీల నాయకులపై తీవ్రమైన విమర్శలు చేయడం వంటివి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ పై కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ మీరు అయ్యా జాగీరా ? అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మీరు ఒక్క విషయాన్నీ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరు. ఈ నేల కోసం కష్టపడినా వారు , ఈ నేల కోసం త్యాగం చేసిన వాళ్ళ నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికీ తెలంగాణ , 4 కోట్ల భూమి పుత్రుల జాగీరు’ అంటూ చెప్పుకొచ్చాడు కేటీఆర్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మీరు ఇక్కడే ఉన్నారు , మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, వ్యాపారాలు చేసుకుంటున్నారు , అలాగే ఉండండి , ఎవరికీ ఇబ్బంది లేదు , 10 , 12 ఏళ్ళ నుండి చిన్న సమస్య అయినా వచ్చిందా?, మేము ఎలాంటి వాళ్ళమంటే , వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రవేటీకరిస్తున్నారు అంటే , వాళ్ళ తరుపున మేము పార్లమెంట్ లో పోరాడాము బీజేపీ తో’ అంటూ ఆయన గుర్తు చేసాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ లో పోటీ చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, 2023 లో ఆయన పోటీ కూడా చేసారని, కానీ ఇక్కడి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అలోచించి మాట్లాడండి అని , మిమ్మల్ని ఎవరూ అడ్డుకోవట్లేదని, మీరే ఊహాజనితమైన ప్రభంజనాలు సృష్టించుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డాడు . పవన్ కళ్యాణ్ నుండి ఓజీ అనే సినిమా వచ్చిందని , మాకు తెలంగాణ లో ఇప్పటికే కేసీఆర్ అనే ఓజీ ఉన్నాడని , మరో ఓజీ అవసరం లేదని, మా రాజకీయాల్లో వేలుపెడితే చూస్తూ ఊరుకోము అంటూ కేటీఆర్ హెచ్చరించాడు.
“పవన్ కల్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే మాకేం ఇబ్బంది లేదు. 2023లో పోటీ చేశారు కూడా.
మీరు తెలంగాణకు రావడంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి.
మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు.. మీరే ఊహాజనితమైన ప్రభంజనాలు సృష్టించుకున్నారు.”
— Gulte (@GulteOfficial) June 3, 2026
