HomeతెలంగాణKTR sensational comments: అటు పవన్‌ కు.. ఇటు కాంగ్రెస్‌కు.. ఇచ్చిపడేసిన కేటీఆర్‌..

KTR sensational comments: అటు పవన్‌ కు.. ఇటు కాంగ్రెస్‌కు.. ఇచ్చిపడేసిన కేటీఆర్‌..

KTR sensational comments: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి 30 నెలలు అయింది. హస్తం పార్టీపై రాష్ట్రంలో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కూడా అన్నదాత ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) కాంగ్రెస్‌ 30 నెలల పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌..
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల అభివృద్ధి గురించి ప్రశ్నించినప్పుడు ‘‘ఎంత కండలు తిరిగిన పెహల్వాన్‌ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టించలేడు’’ అని వ్యాఖ్యానించారు. దీనికి తీవ్ర స్పందన ఇచ్చిన కేటీఆర్‌ ‘‘సరే మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి? మిమ్మల్ని ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం రెండున్నరేళ్లలో కనీస ఫలితాలు కూడా ఇవ్వలేకపోవడాన్ని ఎండగట్టారు.

బంగారు తెలంగాణ సర్వనాశనం..
తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే సర్వనాశనం చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిదని, కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక ఆ పురోగతి నిలిచిపోయిందని ఆరోపించారు. 30 నెలలుగా ఒక్కటి కూడా గుర్తింపు తెచ్చే పని చేయలేదని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు.

పవన్‌ కళ్యాణ్‌పై ఫైర్‌…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌ నిర్వహించాలనుకున్న సభ వివాదాస్పదమైంది. ఈ సంఘటనపై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ విభజన సమయంలో పవన్‌ చూపిన వైఖరి ఇప్పుడు హైదరాబాద్‌లో సభ పెట్టడానికి సరిపోదన్నారు. గతంలో తెలంగాణ విభజనపై పవన్‌ తీసుకున్న ధోరణి, ప్రస్తుతం ఆవిర్భావ దినోత్సవం రోజున సభ పెట్టడంపై మండిపడ్డారు. తెలంగాణ 4 కోట్ల భూమిపుత్రుల జాగీర్‌ అన్నారు. ఉద్యమం ద్వారా సాధించిన విజయాన్ని ఎవరూ తమ రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోకూడదని స్పష్టం చేశారు. కేటీఆర్‌ ఈ వివాదం ద్వారా తెలంగాణ గర్వాన్ని మళ్లీ రేకెత్తించి, తమ పార్టీని రీబ్రాండ్‌ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించిందనడంలో సందేహం లేదు. ఇది కేవలం వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ గతం, వర్తమానం మరియు భవిష్యత్‌ మధ్య జరుగుతున్న సంభాషణగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలా మార్పులు తీసుకురాబోతోందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

తాజా విమర్శల ద్వారా కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టారు. తెలంగాణకు తామే బ్రాండ్‌ అంబాసిడర్లమని చెప్పకనే చెప్పారు. దీంతో ప్రభుత్వం తన 30 నెలల ప్రగతిని స్పష్టమైన గణాంకాలు, ఫలితాలతో నిరూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను సృష్టించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ తనను తాను ‘‘తెలంగాణ అభివృద్ధి రక్షకుడు’’గా ప్రదర్శించుకోవడానికి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version