తెలంగాణKishan Reddy: వ్యవసాయ రంగానికి బిజెపి దిక్సూచి: కిషన్ రెడ్డి.. బాధ్యతగా వ్యవహరించిన "ఏరువాక"

Kishan Reddy: వ్యవసాయ రంగానికి బిజెపి దిక్సూచి: కిషన్ రెడ్డి.. బాధ్యతగా వ్యవహరించిన “ఏరువాక”

Kishan Reddy: తెలంగాణలో సాగు సమస్యలపై ఏరువాక రైతు సామాజిక సాధికార మాస పత్రిక సరికొత్త ప్రశ్న అస్త్రాలను సంధించింది. తెలంగాణలో రైతు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించింది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీవీ9 తెలంగాణ థింగ్స్ టుడే పేరిట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. వివిధ మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు.

ఏరువాక రైతు సాధికారిత మాస పత్రిక ఎడిటర్ గారా రాఘవరావు కేంద్ర ప్రభుత్వ సేవలను అభినందిస్తూనే.. వ్యవసాయపరంగా ఆశించిన స్థాయిలో శ్రద్ధ చూపని వైనాన్ని ప్రస్తావించారు. “జై జవాన్.. జై కిసాన్” అన్న నినాదంతో మోదీ సర్కార్ ముందుకెళ్తోందని.. జై జవాన్ విషయంలో కనిపిస్తున్న పురోగతి.. వ్యవసాయం విషయంలో కనిపించడం లేదని ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి వనరుల సద్వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి బాధ్యతాయుతమైన మీడియాగా చక్కటి ప్రశ్నలు సంధించారని రాఘవరావును అభినందించారు.

దేశంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వాజపేయి హయాంలోనే నదుల అనుసంధాన ప్రక్రియను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకుగాను ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. అయితే 2004లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఈ దేశ రైతాంగానికి దురదృష్టకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు బిజెపి అనుసరించిన విధానాలను.. యూపీఏ కొనసాగించి ఉంటే ఈ దేశంలో వ్యవసాయం రంగం గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోజు చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియ ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులు, సహకార రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత బిజెపి దేనిని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ” ఒకే దేశం- ఒకే మార్కెట్ ” విధానాన్ని తీసుకొచ్చి దళారీ వ్యవస్థ లేకుండా చేసిన ఘనత మోడీ సర్కారుదేనని తేల్చి చెప్పారు. రైతు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా విక్రయించే అధికారాన్ని కట్టబెట్టిన విషయాన్ని సైతం గుర్తు చేశారు. తెలంగాణలో కేవలం ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం 29 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3000 కోట్లు ఖర్చు చేస్తే… దానికి పది రెట్లు బిజెపి ఖర్చు చేస్తున్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఓ ప్రాంతీయ పార్టీ.. దేశంలో బిజెపి అధికారంలో ఉండడం వల్ల.. కొన్ని రకాల రాజకీయ అంశాలు తెరపైకి వచ్చిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. అందుకే తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే.. వ్యవసాయ అనుబంధ రంగాల రూపు రేఖలు మార్చుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మంచి ప్రశ్నలతో ఆలోచింపజేసిన ఏరువాక రైతు సాధికారత మాసపత్రిక ఎడిటర్ గారా రాఘవరావుకు తోటి పాత్రికేయ మిత్రులు, బిజెపి నేతలు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Etela Bandi Meeting: ఈటల, బండి అలయ్ బలయ్: కార్యకర్తలు ఏం తెలుసుకోవాలంటే..

Etela Bandi Meeting: రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే చేస్తారు. వాళ్లకు అనుకూలమైన పనులు మాత్రమే చేస్తారు. అంటే తప్ప కార్యకర్తల అభీష్టానికి నడుచుకోరు. రాజకీయాలు అంటే సేవ కాదు. అది ఒక...

Telangana BJP : తెలంగాణ బీజేపీలో ఫుల్‌ జోష్‌.. నితిన్‌ నబీన్‌ వేసిన మంత్రమిదీ

Telangana BJP : తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అధికారం లేదా ప్రధాన ప్రతిపక్ష స్థానం వచ్చే అవకాశం ఉందని అందరూ భావించినా, పార్టీ మూడో స్థానానికి...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...
Oktelugu Epaper
Exit mobile version