HomeతెలంగాణKCR New Political Strategy: కేసీఆర్‌ చాణక్య వ్యూహం

KCR New Political Strategy: కేసీఆర్‌ చాణక్య వ్యూహం

KCR New Political Strategy: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) ఒక అపార చాణక్యుడిలా గుర్తింపు పొందాడు. 2023 అసెబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో కేసీఆర్‌ మళ్లీ యాక్టీవ్‌ అవుతున్నారు. ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ బలహీనతలను ఉపయోగించి పార్టీని బలోపేతం, పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి వచ్చే […]

KCR New Political Strategy: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) ఒక అపార చాణక్యుడిలా గుర్తింపు పొందాడు. 2023 అసెబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో కేసీఆర్‌ మళ్లీ యాక్టీవ్‌ అవుతున్నారు. ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ బలహీనతలను ఉపయోగించి పార్టీని బలోపేతం, పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి వచ్చే వ్యూహం రూపొందిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి పాలనలో పెరిగిన అసంతృప్తి, ఇరిగేషన్‌ సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు – ఇవన్నీ కేసీఆర్‌ దీర్ఘకాలిక ఆలోచనలో భాగమే.

’సైలెంట్‌ రీచార్జ్‌’
2023 ఎన్నికల ఓటమి తర్వాత, కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిపోయారు. ఇది కేవలం ఆరోగ్య సమస్యలు లేదా డిమోరలైజేషన్‌ కాదు – ఇది ఒక ఆచరణాత్మక మౌనం. రేవంత్‌ రెడ్డి ’స్వయం నిర్బంధన’ అని ఎగతాళి చేసినప్పటికీ, ఈ దూరం వారికి ప్రభుత్వ చర్యలను దగ్గరగా పరిశీలించే అవకాశాన్ని ఇచ్చింది. ఫలితంగా, కాంగ్రెస్‌ పాలనలోని లోపాలు – రైతుల రుణమాఫీలో ఆలస్యం, రైతు బంధు చెల్లింపుల ఆలస్యం, హైడ్రా ద్వారా రియల్‌ ఎస్టేట్‌లో క్షీణత – ఇవన్నీ బీఆర్‌ఎస్‌కు ఆయుధాలుగా మారాయి. ఈ మౌనం, పార్టీ క్యాడర్‌లో ఆందోళన కలిగించినప్పటికీ, కేసీఆర్‌కు ’తెలంగాణ బాపూ’ ఇమేజ్‌ను పునరుద్ధరించే సమయాన్ని ఇచ్చింది. ఇటీవలి పోల్స్‌లో కూడా, ప్రజలు కేసీఆర్‌ను ’ఫామ్‌హౌస్‌’ కంటే ’పబ్లిక్‌ గవర్నెన్స్‌’కు ప్రిఫర్‌ చేశారు, ఇది కాంగ్రెస్‌ స్వయం–పోల్‌లో కూడా స్పష్టంగా కనిపించింది.

పార్టీ పునరుజ్జీవనం..
బీఆర్‌ఎస్‌ పునరుద్ధరణకు కేసీఆర్‌ రూపొందించిన ప్లాన్, గ్రాస్‌రూట్‌ స్థాయిలో ప్రారంభమై, రాష్ట్రవ్యాప్త చర్చలతో ముగుస్తోంది. 2025 ఫిబ్రవరిలో పార్టీ సిల్వర్‌ జూబిలీ జరుపుతూ, వారు మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు, ఇది కేవలం సంఖ్యలు పెంచడం కాదు – ప్రజల అసంతృప్తిని రాజకీయ ఊపందుకునేందుకు ఉద్దేశించినది. రైతు ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల సమస్యలు, విద్యార్థుల అభ్యంతరాలు – ఇవి పార్టీ సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. కేసీఆర్, ‘కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు బాధపడుతున్నారు, మేము వారి పక్షంలో నిలుస్తాం‘ అని ప్రకటించారు. కేటీఆర్, ‘మా తండ్రి సరైన సమయంలో రావడం తెలుసు‘ అని చెప్పడం, వారి కుటుంబ వ్యూహాన్ని సూచిస్తుంది – కేసీఆర్‌ లీడర్‌షిప్‌లో, కేటీఆర్‌ యువతను టార్గెట్‌ చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తారు. ఇటీవలి డెఫెక్షన్లు (ఎమ్‌ఎల్‌ఏలు కాంగ్రెస్‌లోకి వెళ్లడం) కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారవచ్చు – బై–ఎలక్షన్లు జరిగితే, ప్రజలు ’కాంగ్రెస్‌ లేదా బీఆర్‌ఎస్‌’ మధ్య ఎంపిక చేస్తారని కేటీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు.

రేవంత్‌ పాలన బలహీనతలపై దాడి..
కేసీఆర్‌ వ్యూహంలో కీలకం, కాంగ్రెస్‌ పాలనలోని లోపాలను హైలైట్‌ చేయడం. 420 ప్రామిస్‌లలో చాలా ఇంకా అమలు కాలేదు – రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అసంతృప్తితో ముందుకు వస్తున్నారు. కలేశ్వరం ప్రాజెక్ట్‌ పంపులు ఆఫ్‌ చేయడం, యూరియా కొరత వంటి సమస్యలను ఎత్తి చూపారు. ఇది మాత్రమే కాదు, బీజేపీతో ’టాకిట్‌ అండర్‌స్టాండింగ్‌’ ఆరోపణలను ఎదుర్కొని, వారిని ’అంటీ–తెలంగాణ’గా చిత్రీకరిస్తున్నారు. ఫలితంగా, అంటీ–ఇంకంబెన్సీ పెరుగుతోంది – రియల్‌ ఎస్టేట్‌ క్షీణత, కన్‌స్ట్రక్షన్‌ ఆగిపోవడం వంటివి ప్రజల్లో కోపాన్ని మరింత పెంచుతున్నాయి. కేసీఆర్‌ ఈ అసంతృప్తిని ప్రజా ఉద్యమంగా మలిచి, 2026–28 మధ్య తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper