HomeతెలంగాణKancha Gachibowli :కేసీఆర్ నాటిన అడవి మరీ.. సోషల్ మీడియాలో సెటైర్ ల వర్షం

Kancha Gachibowli :కేసీఆర్ నాటిన అడవి మరీ.. సోషల్ మీడియాలో సెటైర్ ల వర్షం

Kancha Gachibowli  : అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి అని.. దానిని రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేస్తారా అని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంటే.. లేదు లేదు ఆ భూములు చదును చేసి అభివృద్ధి చేసి.. 50 వేల కోట్ల ఆదాయం వచ్చేలాగా చేస్తామని అధికార కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే ఈ వివాదం న్యాయస్థానాల దాకా వెళ్ళింది. గౌరవ తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఈ వివాదంపై తీర్పును రిజర్వ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. హైకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో పడగొట్టిన చెట్లను పరిశీలించాలని.. తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కంచ గచ్చిబౌలి ప్రాంతంలో భూమి చదును చేసే పనులు ఆగిపోయాయి. ఈ భూములకు సంబంధించి భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ 400 ఎకరాల భూములను ఎవరు కొనుగోలు చేసినా.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో విచిత్రమైన ప్రచారానికి దిగారు.

Also Read : కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కెసిఆర్ నాటిన అడవి మరీ

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నానా యాగీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులకు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో డైనోసార్లు, ఏనుగులు, జింకలు, సింహాలు ఉన్నట్టు.. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు అవి అడవిగా మారినట్టు.. అందువల్లే హైటెక్ సిటీ ప్రాంతంలో అరుదైన జంతువులు జీవిస్తున్నట్టు.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఓ ఫోటోను రూపొందించారు. “కెసిఆర్ హయాంలో హైటెక్ సిటీలో అడవి ఏర్పడింది. ఆ అడవిలోనే జంతువులు మొత్తం జీవిస్తున్నాయి. 10 సంవత్సరాల కాలంలో విపరీతంగా మొక్కలు నాటారు కాబట్టి హైటెక్ సిటీ ప్రాంతం మొత్తం అడవిగా మారిపోయిందని” కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ నాయకులు కూడా బలం పెంచుకున్నారు. సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి నాయకులకు దీటుగా బదులిస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో భారత రాష్ట్ర సమితి నాయకులకు ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆకస్మాత్తుగా ఇలాంటి ఆర్టిఫిషియల్ యుద్ధానికి దిగడంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితి నాయకులు డిఫెన్స్ లో పడ్డారు. అయితే వారు తదుపరి అడుగులు ఎలా వేస్తారో తెలియదు కాని.. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నాయకులు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. కాంగ్రెస్ నాయకులు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇమేజ్ లో కారు ఫోటోను కూడా జత చేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version