KCR: మౌన దీక్షలో గులాబీ బాస్‌.. ఇంకెంత కాలం..?

అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తా, పొరుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను మార్చేస్తా, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తప్ప మరే పార్టీనైనా తొక్కేస్తా అంటూ బీరాలు పలికిన కేసీఆర్‌..

Written By: Raj Shekar, Updated On : June 19, 2024 12:16 pm

KCR

Follow us on

KCR: ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నెల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం తర్వాత పదేళ్లు తెలంగాణను ఏలిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైలెంట్‌ అయ్యారు. అధికారంలో ఉండి అహంకార ప్రదర్శించిన గులాబీ పార్టీని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బండకేసి బాదారు. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా చుట్టేశారు. ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ కూతురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేసిన కేసీఆర్‌.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. మూడు నెలలుగా జైల్లో ఉన్న కవితను కూడా పరామర్శించేందుకు వెళ్లడం లేదు.

కూతురుకు బెయిల్‌ తెచ్చుకోలేక..
అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తా, పొరుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను మార్చేస్తా, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తప్ప మరే పార్టీనైనా తొక్కేస్తా అంటూ బీరాలు పలికిన కేసీఆర్‌.. అధికారం కోల్పోయాక తన కూతురు కవితను జైలు నుంచి విడిపించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల సమయంలో తన గెలుపుతోపాటుగా ఏపీలో తన మిత్రుడు జగన్‌ గెలుపు కోసం కూడా సాయమందించిన కేసీఆర్‌ ఇప్పుడు సొంత పార్టీని కాపాడుకోవడానికి మరొకరిసాయం సాయం కోరాల్సిన పరిస్థితి నెలకొంది.

మార్పు మంచిదే..
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పార్టీ పేరు మార్చిన కేసీఆర్‌.. పార్టీ నేతల స్థానాలు మార్చి ఆయన స్నేహితుడు జగన్‌ అధికారం కోల్పోయారు. వారి గెలుపు కలలను ప్రజలు కల్లలు చేశారు. ఓటమి రుచి చూపించారు. మరోవైపు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో గులాబీ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీని వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయిందని, రెట్టింపు స్పీడ్‌తో మళ్లీ వస్తుందని చెప్పి పార్టీ క్యాడర్‌లో ధైర్యం నింపే పనిచేశారు. కానీ, రెంట్టింపు స్పీడ్‌ కాదు.. స్టార్టింగ్‌ ట్రబుల్‌లో చతికిల పడిందని గుర్తించిన క్యాడర్‌ ఇక ఆ పార్టీలో ఉన్నా లాభం లేదని భావిస్తున్నారు. దీంతో కేసీఆర్‌ ఇప్పుడు నోరు తెరవడానికి కూడా భయపడుతున్నారని తెలుస్తోంది. ఈ మౌనం ఎన్నాళ్లు అన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. మౌనం వీడకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని క్యాడర్‌ ఆందోళన చెందుతోంది.