spot_img
HomeతెలంగాణK A Paul: కవిత 10 కోట్లు అడిగితే.. కెసిఆర్ ఎందుకు వద్దన్నారు.. కేఏ పాల్...

K A Paul: కవిత 10 కోట్లు అడిగితే.. కెసిఆర్ ఎందుకు వద్దన్నారు.. కేఏ పాల్ బయటపెట్టిన నిజం

K A Paul: రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సీరియస్ వ్యవహారంగా సాగుతున్నప్పుడు.. అకస్మాత్తుగా కేఏ పాల్ ప్రవేశిస్తారు.. సీరియస్ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన గురించి చర్చ జరిగేలా చూసుకుంటారు. కేఏ పాల్ ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ.. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశారు.

తెలంగాణలో కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పేరుతో ఇటీవల పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ఆమోదముద్ర లభించేలా చూసుకున్నారు. ఒకరకంగా భారత్ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించే పనిచేస్తున్న నేపథ్యంలో.. అకస్మాత్తుగా కవిత తన పార్టీ పేరు టిఆర్ఎస్ అని పేరు ప్రకటించి.. ఆ పేరును తనకు మాత్రమే పరిమితమయ్యేలాగా చూసుకున్నారు. తద్వారా రాజకీయంగా కవిత గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ కు గట్టి సవాల్ విసిరారు.. కవిత అంతటితోనే ఆగలేదు. తన తండ్రి మీద.. తన సోదరుడి మీద.. బావ హరీష్ రావు మీద.. మరో సోదరుడు సంతోష్ రావు మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఇదంతా కుటుంబ గొడవ అని కొంతమంది వాదిస్తున్నప్పటికీ.. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ కవిత మీడియాలో పతాక శీర్షికలో ఉంటున్నారు.

కవిత గొడవ అలా ఉంటే.. మధ్యలోకి కేఏ పాల్ ప్రవేశించారు. ఈ రాజకీయ రణరంగాన్ని మరోవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక స్వీయ వీడియోలో కేఏ పాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ” నేను అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపే పనిలో బిజీగా ఉన్నాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో అనేక పర్యాయాలు మాట్లాడాను.. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధితో కూడా చర్చలు జరిపాను. ఇదిలా ఉండగానే కవిత తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ప్రకటించారు. ఇదంతా కూడా సోదరుడితో జరుగుతున్న ఆస్తుల గొడవ. 2008లో నా చారిటీ సిటీ వద్దకు కవిత వచ్చారు. 10 కోట్లు ఇవ్వాలని అడిగారు. నేను కేసీఆర్ కు ఫోన్ చేశాను. మీరు అడిగితే 10 కాదు, 15 కోట్లు కూడా ఇస్తాను. కానీ కవిత 10 కోట్లు అడుగుతున్నారు.. ఎంత ఇవ్వమంటారని కేసీఆర్ ను అడిగాను. దానికి ఆయన రూపాయి కూడా ఇవ్వద్దని చెప్పారు. నేను కూడా కవితకు రూపాయి ఇవ్వలేదని” కేఏ పాల్ వ్యాఖ్యానించారు..

ఊరందరిది ఒక దారి అయితే.. ఉలిపి కట్టేది మరొక దారి అంటారు. ఇప్పుడు కేఏ పాల్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. కవిత ఎందుకోసం పార్టీ ఏర్పాటు చేశారు.. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి.. అనే విషయాలను పక్కన పెడితే.. ఈ వ్యవహారాన్ని మొత్తం పూర్తి హాస్యాస్పదంగా మార్చడానికి కేఏ పాల్ కంకణం కట్టుకున్నట్టున్నారు. అందువల్లే తర్కం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టారు. కే ఏ పాల్ ఈ వీడియో బయటికి విడుదల చేయడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీరియస్ పాలిటిక్స్ చేయడం ఎవరికైనా సాధ్యమవుతుంది. అందులోనూ నవ్వులు పండించడం కొందరికే సాధ్యమవుతుంది. అందులో కేఏ పాల్ మొదటి స్థానంలో ఉంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Oktelugu Epaper
Exit mobile version