HomeతెలంగాణHeavy Rains In Telangana: తెలంగాణలో రెండు రోజులు కుండపోత వర్షాలు.. అరెంజ్ అలర్ట్ జారీ

Heavy Rains In Telangana: తెలంగాణలో రెండు రోజులు కుండపోత వర్షాలు.. అరెంజ్ అలర్ట్ జారీ

Heavy Rains In Telangana: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికతో ఆరు జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Heavy Rains In Telangana
Heavy Rains In Telangana

వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. నిజామాబాద్, నల్గొండ, సూర్యపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని సమాచారం. శనివారం నిజామాబాద్, నల్గొం, సూర్యపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని చెబుతోంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆది, సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని చెబుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఈనెల 10 వరకు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన తేమతో కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నారు. దీంతో భారీ వర్షాలతో పంటలు దెబ్బ తింటున్నాయి.

Heavy Rains In Telangana
Heavy Rains In Telangana

ఇది వరకే ప్రాజెక్టులు అన్ని నిండిపోవడంతో ఇప్పుడు కురిసే వానలతో పంటల్లోకి నీరు చేరుతోంది. జులైలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్ని నిండుకుండల్లా మారడంతో పంటలకు నష్టం కలగనుంది. పంటల్లోకి నీరు చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రుతుపవనాలు పోయినా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడటంతో పంటలకు దెబ్బ తగలనుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారం అందించాలని ప్రాధేయపడుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version