సుజనా, జీవీకే మాల్ లపై జీహెచ్ఎంసీ కొరఢా

జీహెచ్ఎంసీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు  నగరవాసులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ శంకుస్థాపనలు.. అభివృద్ధి పేరిట చేసే హడావుడి మాములుగా ఉండటం లేదు. ఇక ప్రతిపక్షాలు సైతం ప్రచారం కాలనీల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు సైతం మేమేమీ తక్కువ కాదన్నట్లు పనులు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు అక్రమ నిర్మాణాలపై మొద్దునిద్ర పోతున్న అధికారులు ఉన్నట్టుండి భారీ జరిమానాలు వేస్తుండటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. […]

Written By: NARESH, Updated On : September 23, 2020 4:23 pm

unnamed

Follow us on

జీహెచ్ఎంసీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు  నగరవాసులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ శంకుస్థాపనలు.. అభివృద్ధి పేరిట చేసే హడావుడి మాములుగా ఉండటం లేదు. ఇక ప్రతిపక్షాలు సైతం ప్రచారం కాలనీల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు సైతం మేమేమీ తక్కువ కాదన్నట్లు పనులు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఇన్నాళ్లు అక్రమ నిర్మాణాలపై మొద్దునిద్ర పోతున్న అధికారులు ఉన్నట్టుండి భారీ జరిమానాలు వేస్తుండటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో స్పెషల్ డ్రైవ్ పేరిట తిరుగుతున్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు.. బ్యానర్లు, హోర్డింగులను తొలగించడంతో పాటు నిర్వాహకులకు భారీ జరిమానాలు విధిస్తూ షాకిస్తున్నారు.

నిబంధనలు పాటించడం లేదంటూ కూకట్‌పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్‌కు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏకంగా రూ.4లక్షల జరిమానా విధించారు. సుజనా మాల్స్‌కు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ జరిమానా పేరిట మొత్తంగా రూ.16 లక్షల50వేల జరిమానా విధించినట్లు తెలస్తోంది. దీంతోపాటు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు రూ. 2లక్షలు.. బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు రూ. 2లక్షల జరిమానాను జీహెచ్ఎంసీ అధికారులు  విధించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు భారీ జరిమానాలు విధిస్తుంటంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. నగరంలో నిత్యం స్పెషల్ డ్రైవ్ చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చూడాల్సి అధికారులు తుతుమంత్రంగా జరిమానాలు విధిస్తుండటపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. అధికారులు కొద్దిరోజులు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం కామన్ అయిపోయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

 
ఎన్నికల వస్తుండటంతో తాము కూడా చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ప్రజలు నమ్మేలా అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ చిత్తశుద్ధి ఎన్నికల తర్వాత కూడా ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే..!