spot_img
HomeతెలంగాణCM Revanth Reddy Davos Tour: రేవంత్ రెడ్డి మంత్రుల దావోస్ టూర్.. ఈసారి ప్లాన్...

CM Revanth Reddy Davos Tour: రేవంత్ రెడ్డి మంత్రుల దావోస్ టూర్.. ఈసారి ప్లాన్ ఏంటి

CM Revanth Reddy Davos Tour: రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నప్పటికీ.. సొంత మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. విమర్శలు చేయడంలోనూ తగ్గడం లేదు. పైగా బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని పిలుపునిస్తున్నారు. ఆ పార్టీని 100 మీటర్ల లోతులో పాతిపెట్టాలని స్పష్టం చేస్తున్నారు.

మేడారం జాతరలో భాగంగా అభివృద్ధి పనులను పరిశీలించి.. సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సోమవారం సాయంత్రం దావోస్ వెళ్ళిపోయారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనడానికి ఆయన మంత్రులతో కలిసి వెళ్లిపోయారు. దావోస్ ప్రాంతంలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. అక్కడ గూగుల్, యూనిలీవర్, హనీ వెల్, లోరెల్, నోవార్టీస్, సేల్స్ ఫోర్స్, టాటా గ్రూప్స్, డిపి వరల్డ్, సిస్కో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి వేరువేరుగా భేటీ అవుతారు. అంతర్జాతీయ ప్రతినిధులతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు..

చర్చలు, భేటీల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు , స్థాపించిన సంస్థల విస్తరణ పై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అదృష్ట సార్ ఇస్తారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సెండ్ చేసి ఉంటే రంగాలలో భారీగా పెట్టుబడులను తీసుకురావడమే తన లక్ష్యమని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. గత డిసెంబర్లో హైదరాబాదులో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం నిర్వహించింది. ఆ సమయంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించింది . మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ రూపొందించింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ శక్తిసామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తెలంగాణ రైసింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రదర్శించాలని అధికారులకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రితో దావోస్ వెళ్ళిన వారిలో ఉన్నారు. ఈసారి కూడా భారీగా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా ముఖ్యమంత్రి రూపకల్పన చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper