HomeతెలంగాణCash For Vote Case: ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం

Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం

Cash For Vote Case: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషనర్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభుత్వానికి నోటీసులు పంపింది.

బీఆర్‌ఎస్‌ నేతల పిటిషన్‌
ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కోర్టుకు మార్చాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మహమూద్‌ అలీలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌.గవాయ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం శుక్రవారం(ఫిబ్రవరి 9న) విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డికి, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసలు పంపింది. ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నందున దర్యాప్తు పారదర్శకంగా జరగదని పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేశారు. ట్రయల్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈమేరకు జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాది మోహిత్‌రావు కోర్టుకు విన్నవించారు. ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉంటే తాము చూస్తూ ఊరుకోమని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్‌రెడ్డిపై 88 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తెలిపారు. దీంతో న్యాయస్థానం నోటీసులు జారీ చేసి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. మరి నోటీసులకు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version