ట్రాక్టర్ ను ఢీకొట్టిన వాహనం: ఇద్దరు మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తిమ్మాజిపేట మండలం లక్ష్మణ్ నాయక్ తండాకు చెందిన వాల్య నాయక్, రాములు నాయక్, గొరిట గ్రామానికి చెందిన మల్లయ్య అనే ముగ్గురు గొర్ల కొనుగోలు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఊరుకొండ శివారులో మెయిన్ రోడ్డుపై డీజిల్ అయిపోవడంతో ట్రాక్టర్ ను నిలిపి ఉంచారు. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారు ఆ ట్రాక్టర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వాల్య నాయక్, రాములు […]

Written By: Suresh, Updated On : November 12, 2020 9:13 am

accident

Follow us on

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తిమ్మాజిపేట మండలం లక్ష్మణ్ నాయక్ తండాకు చెందిన వాల్య నాయక్, రాములు నాయక్, గొరిట గ్రామానికి చెందిన మల్లయ్య అనే ముగ్గురు గొర్ల కొనుగోలు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఊరుకొండ శివారులో మెయిన్ రోడ్డుపై డీజిల్ అయిపోవడంతో ట్రాక్టర్ ను నిలిపి ఉంచారు. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారు ఆ ట్రాక్టర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వాల్య నాయక్, రాములు నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. గొరిట గ్రామానికి చెందిన మల్లయ్య తీవ్రంగా గాయపడడంతో కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు.