వర్ష బీభత్సాని కి కూలిన ఇళ్లు.. 8 మంది మృతి..

తెలంగాణలో వర్షం భీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా పాతబస్తీలో రెండు ఇళ్ల కూలిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గౌస్‌నగర్‌ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం నుంచి రాళ్లు క్రిందికి వచ్చి ఇళ్లపై పడడంతో గోడలు కూలిపోయాయి. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో నలుగురు గాయపడగా సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం […]

Written By: Suresh, Updated On : October 14, 2020 9:48 am
Follow us on

తెలంగాణలో వర్షం భీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా పాతబస్తీలో రెండు ఇళ్ల కూలిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గౌస్‌నగర్‌ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం నుంచి రాళ్లు క్రిందికి వచ్చి ఇళ్లపై పడడంతో గోడలు కూలిపోయాయి. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో నలుగురు గాయపడగా సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన ఫలక్‌నుమా ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.