రాజాసింగ్ ఇంట్లో విషాదం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన బావమరిది మనీష్ సింగ్ కుమారుడు రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మనీష్ సింగ్ కుటుంబ సభ్యులు , రాజాసింగ్ ఇంట్లోనే ఉంటున్నారు. కాగా రోహిత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈరోజు రోహిత్ అంత్యక్రియలు మంగల్హాట్ శ్మశానంలో జరగనున్నట్లు బీజేపీ గోషామహల్ ఇన్ చార్జి క్రుష్ణ తెలిపారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాజాసింగ్ చేసిన ఆరోపణల ఆడియో వైరల్ అయింది. కానీ దీనిపై సంజయ్ ఏ […]

Written By: Suresh, Updated On : November 23, 2020 10:17 am
Follow us on

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన బావమరిది మనీష్ సింగ్ కుమారుడు రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మనీష్ సింగ్ కుటుంబ సభ్యులు , రాజాసింగ్ ఇంట్లోనే ఉంటున్నారు. కాగా రోహిత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈరోజు రోహిత్ అంత్యక్రియలు మంగల్హాట్ శ్మశానంలో జరగనున్నట్లు బీజేపీ గోషామహల్ ఇన్ చార్జి క్రుష్ణ తెలిపారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాజాసింగ్ చేసిన ఆరోపణల ఆడియో వైరల్ అయింది. కానీ దీనిపై సంజయ్ ఏ విధంగా స్పందించలేదు. తన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదని, బండి సంజయ్ మోసం చేశాడంటూ ఆ ఆడియోలో తెలిపారు. దీనిపై అధిష్టానాన్ని కూడా కలుస్తానన్నాడు.