కిడ్నాపైన ముగ్గురి ఆచూకీ లభ్యం

హైదరాబాద్లో కిడ్నాప్ నకు గురైన ముగ్గురి ఆచూకీ లభించింది. సికింద్రాబాద్ లోని బోయినపల్లి మనోవికాస్ నగర్ కు చెందిన ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారి ఆచూకీ లభించినట్లు, ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా కిడ్నాప్ చేసిన  వ్యక్తులను అరెస్టు చేశామని, త్వరలో […]

Written By: Suresh, Updated On : January 6, 2021 7:05 am
Follow us on

హైదరాబాద్లో కిడ్నాప్ నకు గురైన ముగ్గురి ఆచూకీ లభించింది. సికింద్రాబాద్ లోని బోయినపల్లి మనోవికాస్ నగర్ కు చెందిన ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారి ఆచూకీ లభించినట్లు, ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా కిడ్నాప్ చేసిన  వ్యక్తులను అరెస్టు చేశామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ నకు గురైన వారిలో ప్రవీణ్ రావు మాజీ హాకీ ప్లేయర్ తో పాటు సీఎం కేసీఆర్ కు బంధువు అయినట్లు సమాచారం.