తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ధరణి సర్వే జీహెచ్ఎంసీలో తాత్కాలికంగా నిలిపివేశారు. నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దీంతో ధరణి సర్వే చేసే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు తెలిపారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది తరువాత ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. కాగా హైదరాబద్లోని వరద ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించారు.