రేపటి నుంచి తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులపాటు సాగనున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీెహెచ్ఎంసీ) చట్ట సవరణ బిల్లుకు, హైకోర్టు సూచించిన కొన్నిం అంశాలపై చర్చించేందుకు మంగళవారం నుంచి సమావేశం కానున్నారు. ఈ మేరకు సమావేశాల ఏర్పాట్లను సోమవారం స్పీకర్  పోచారం  శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. గత నెలలో నిర్వహించిన సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. మరోమారు కరోనా లక్షణాలు […]

Written By: Suresh, Updated On : October 12, 2020 3:16 pm

Telangana Assembly

Follow us on

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులపాటు సాగనున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీెహెచ్ఎంసీ) చట్ట సవరణ బిల్లుకు, హైకోర్టు సూచించిన కొన్నిం అంశాలపై చర్చించేందుకు మంగళవారం నుంచి సమావేశం కానున్నారు. ఈ మేరకు సమావేశాల ఏర్పాట్లను సోమవారం స్పీకర్  పోచారం  శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. గత నెలలో నిర్వహించిన సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. మరోమారు కరోనా లక్షణాలు ఉన్నవారిని పరీక్ష చేసే అవకాశం ఉంది.  రేపు సమావేశానికి వచ్చేవారికి శానిటైజర్ చేయాలని, మాస్్క తప్పని సరిగా ధరించేలా చూడాలని అధికారులకు సూచించారు.