ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చేవెళ్లలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సికింద్రాబాద్ తాడ్ బండ్ కు చెందిన ఇన్నోవా కారులో ప్రయాణిస్తుండగా చేవెళ్ల మండలం మల్కాపూర్ శివారులో బుధవారం ఉదయం బోర్ వెల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ తో సహా ఆరుగురు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మ్రుతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Written By: Suresh, Updated On : December 2, 2020 8:37 am
Follow us on

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చేవెళ్లలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సికింద్రాబాద్ తాడ్ బండ్ కు చెందిన ఇన్నోవా కారులో ప్రయాణిస్తుండగా చేవెళ్ల మండలం మల్కాపూర్ శివారులో బుధవారం ఉదయం బోర్ వెల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ తో సహా ఆరుగురు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మ్రుతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.