టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నాడని హైదరాబాద్ సిటిన్యూరో సెంటర్ ఆసుపత్రి బృందం బులిటెన్ విడుదల చేసింది. ఐసీయూలో ఉన్న ఆయనకు హై ప్లో ఆక్సిజన్ ఆందిస్తున్నామని తెలిపారు. గతంలో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడింది. ఆయన సతీమణి జీవిత, కూతుళ్లు వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి బృందం వివరించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.