గ్రాడ్యుయేట్ ఓటర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే నెలలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇన్చార్జిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేశామని, అది టీఆర్ఎస్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతోనే సాధ్యమైందన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.