దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నిన్న జరిగిన ఉద్రికత్తల నేపథ్యంలో మంగళవారం బీజేపీ నాయకులు చలో ప్రగతిభవన్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకులను బయటికి రాకుండా పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. అయితే పార్టీ జాతీయ నేత డీకె అరుణ, మోత్కుపల్లి నర్సింహులు దుబ్బాకలో ప్రచారానికి వెళ్లాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొదట ఒప్పుకోని పోలీసులు ఆ తరువాత ప్రగతిభవన్కు వెళ్లకుండా ప్రచారానికి వెళ్ళొచ్చని అనుమతినిచ్చారు.