రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ లోని ఓ భవనం లిప్ట్లో ఇరుక్కుపోయారు. సైపాబాద్లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చి తిరిగి వెళ్తుండగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆయనతో పాటు టీఆర్ఎస్ నాయకులు, పలువురు ఆయనతోపాటు లిప్ట్లో ఇరుక్కుపోవడంతో ఆందోళన వాతావరణం నెలకొంది. మంత్రిని లిప్ట్ నుంచి బయటకు తీసేందుకు సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. అయితే 30 నిమిషాల తరువాత మంత్రి లిఫ్ట్ నుంచి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సమస్యలు రావడంతో లిప్ట్ మధ్యలోనే ఆగిపోయిందిస సిబ్బంది తెలిపారు.