తెలంగాణ చరిత్రలోనే అత్యధికం.. అమెజాన్ 20 వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణ విడిపోతే ఏడారి అవుతుందన్నారు. కరెంట్ కోతలతో చిమ్మి చీకట్లు కమ్ముకుంటాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల లొల్లితో జలయుద్ధాలు వస్తాయన్నారు. తెలంగాణ బీడు భూములన్నీ ఎండిపోతాయన్నారు. కానీ నవ్విన నాపచేనే పండింది. ఆరేళ్లలో స్పష్టమైన అభివృద్ధి సాధ్యమైంది. హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. ఇప్పుడు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు జెఫ్ బెజోస్ కు చెందిన ప్రపంచ దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా తెలంగాణలో భారీ […]

Written By: NARESH, Updated On : November 6, 2020 4:05 pm
Follow us on

తెలంగాణ విడిపోతే ఏడారి అవుతుందన్నారు. కరెంట్ కోతలతో చిమ్మి చీకట్లు కమ్ముకుంటాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల లొల్లితో జలయుద్ధాలు వస్తాయన్నారు. తెలంగాణ బీడు భూములన్నీ ఎండిపోతాయన్నారు. కానీ నవ్విన నాపచేనే పండింది. ఆరేళ్లలో స్పష్టమైన అభివృద్ధి సాధ్యమైంది. హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. ఇప్పుడు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు జెఫ్ బెజోస్ కు చెందిన ప్రపంచ దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడులను అమెజాన్ పెడుతోందని మంత్రి కేటీఆర్‌‌ తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ తెలంగాణలో ముందుకొచ్చిందని వెల్లడించారు. ఈ పెట్టుబడిని తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా కేటీఆర్‌‌ తెలిపారు.

Also Read: వరద సాయం: చేతులు కాలాక టీఆర్ఎస్ సర్కార్ ఆకులు పట్టుకుందా?

అమెరికాకు చెందిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ హైదరాబాద్‌ను భారత్‌లో తమ రెండో ఏడబ్ల్యూఎస్‌ రీజియన్‌గా ఎంచుకుంది. ఈ సెంటర్‌‌ను 2022 ప్రైమరీలోనే అందుబాటులోకి తెస్తామని అమెజాన్‌ వెల్లడించింది. ఇప్పటికే 2019 ఆగస్టులో అతిపెద్ద గ్లోబల్‌ క్యాంపస్‌ను నెలకొల్పిన అమెజాన్‌ తాజాగా మరో భారీ పెట్టుబడికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం శుభపరిణామమని మంత్రి కేటీఆర్‌‌ చెప్పారు.

ప్రస్తుతం అమెజాన్‌ ఏర్పాటు చేస్తున్న ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా వేలాది మంది వెబ్‌ డెవలపర్లకు, స్టార్టప్‌లకు, ఐటీ కంపెనీలకు లాభం చేకూరనుంది. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈకామర్స్‌, పబ్లిక్‌సెక్టార్‌‌, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లోనూ తమ కార్యకలాపాల విస్తృతి అవకాశం కలుగనుంది. భవిష్యత్తులోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్‌‌ ట్విట్టర్‌‌ వేదికగా ప్రకటించారు.

Also Read: రాజకీయ అడ్డాగా మారిన దుర్గ గుడి

కంపెనీతో వరుసగా సమావేశాలు నిర్వహించడం వల్లే ఇది సాధ్యపడిందని వెల్లడించారు. అమెజాన్‌ లాంటి ప్రఖ్యాత సంస్థ తెలంగాణ డేలా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెడుతుండడంతో ఫ్యూచర్‌‌లోనూ డేటా సెంటర్ల పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారే అవకాశముందని స్పష్టం చేశారు. కాగా.. ఈ డేటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్‌ ఎకానమీ, ఐటీ రంగం రెట్లు వృద్ధి సాధించనుంది.