తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీంపై బుధవారం హైకోర్టులో విచారణ చేయనున్నారు. గతంలో ఈ పథకంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్రప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయునుంది. కాగా ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ప్రజల డేటా భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని కోరింది. దీంతో రెండు రోజులు గడువుకావాలని కోరిన ప్రభుత్వ తరుపున న్యాయవాది ఈరోజు కౌంటర్ దాఖలు చేయనున్నారు.