దుబ్బాక విజయం చారిత్రాత్మకం : మోడీ

దుబ్బాకలో బీజేపీ గెలుపుపై తెలంగాణవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్ రావుకు బీజేపీ అధిష్టానం ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దుబ్బాక ఉప ఎన్నికపై స్పందించారు. ఈ విజయం చారిత్రాత్మకమన్నారు. బీజేపీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు. మరోవైపు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రఘునందన్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. […]

Written By: Suresh, Updated On : November 11, 2020 10:59 am
Follow us on

దుబ్బాకలో బీజేపీ గెలుపుపై తెలంగాణవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్ రావుకు బీజేపీ అధిష్టానం ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దుబ్బాక ఉప ఎన్నికపై స్పందించారు. ఈ విజయం చారిత్రాత్మకమన్నారు. బీజేపీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు. మరోవైపు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రఘునందన్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని వెన్నంటి ఉండి నడిపించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సైతం ఢిల్లీ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దుబ్బాక ఫలితం వచ్చిన వెంటనే సంజయ్ కి అమిత్ షా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.