దుబ్బాకలో ఓడిపోతామని కేసీఆర్ కు తెలుసు: జితేందర్ రెడ్డి

దుబ్బాకలో బీజేపీ గెలుపుపై టీఆర్ఎస్ పై రకరకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మంత్రి హరీశ్ రావుకు దుబ్బాక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ తాను ఆ నియోజకవర్గంలో పర్యటించకపోవడంపై పలువువు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ లో ఎంపీగా కొనసాగి బీజేపీలో చేరిన జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఓడిపోతామని తెలిసే హరీశ్ రావును బలిపశువు చేశారని విమర్శించారు. హైదరాబాద్ లోని గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక లాగే బీజేపీ సత్తా చూపిస్తామని తెలిపారు. బీజేపీ ఖచ్చితంగా […]

Written By: Suresh, Updated On : November 11, 2020 2:37 pm
Follow us on

దుబ్బాకలో బీజేపీ గెలుపుపై టీఆర్ఎస్ పై రకరకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మంత్రి హరీశ్ రావుకు దుబ్బాక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ తాను ఆ నియోజకవర్గంలో పర్యటించకపోవడంపై పలువువు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ లో ఎంపీగా కొనసాగి బీజేపీలో చేరిన జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఓడిపోతామని తెలిసే హరీశ్ రావును బలిపశువు చేశారని విమర్శించారు. హైదరాబాద్ లోని గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక లాగే బీజేపీ సత్తా చూపిస్తామని తెలిపారు. బీజేపీ ఖచ్చితంగా హిందువుల పార్టీయేనన్న సంజయ్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నామన్నారు.