తెలంగాణ మాజీ మంత్రి మృతి

తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి చెందారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూశారు. రామంరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిగి ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం సాధించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. ఆ తరువాత 2018లో టీఆర్ఎస్ చేరారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు […]

Written By: Suresh, Updated On : December 5, 2020 9:29 am
Follow us on

తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి చెందారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూశారు. రామంరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిగి ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం సాధించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. ఆ తరువాత 2018లో టీఆర్ఎస్ చేరారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మహబూబ్ నగర్ కు చెందిన రాంరెడ్డి అంత్యక్రియలు సాయత్రం మహ్మదాబాద్ లో జరగనున్నాయి. ఆయన మ్రుతికి టీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.