మెదక్ జిల్లాలో ప్రవహిస్తున్న మంజీరా నది మధ్యలో నలుగురు జాలర్లు చిక్కుకున్నారు. మంగళవారం సాయంత్రం మంజీరా నధి ఉధృతి తగ్గడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. సింగూరు నుంచి నీరు వదలడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొల్చారం మండలం కిష్టాపూర్కు చెందిన నలుగురు మంజీరా నది మధ్యలో చిక్కుకున్నారు. విఫయం తెలిసిన వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం ఉదయం హనుమాన్ బండల వద్దకు చేరుకున్నారు. మెదక్ సీఐ బాధితులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.