
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 753 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,68,418 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,451గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,56,330 మంది కోలుకోగా ప్రస్తుతం 10,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా నిన్న ఒక్కరోజు 41, 991 కరోనా పరీక్షలు నిర్వహించారు.