పోలీసులకు రేవంత్‌రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం.. అరెస్ట్‌

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు వరద నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును పరిశీలించేందుకు రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ మల్లు రవి బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో తెక్కపల్లి వద్ద కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ నేతలు వాహనాల నుంచి కిందికి దిగకపోవడంతో వారికి […]

Written By: Suresh, Updated On : October 17, 2020 11:32 am
Follow us on

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు వరద నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును పరిశీలించేందుకు రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ మల్లు రవి బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో తెక్కపల్లి వద్ద కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ నేతలు వాహనాల నుంచి కిందికి దిగకపోవడంతో వారికి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.