
బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రావుల శ్రీ ధర్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా శ్రీ ధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూశాక టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అనిపించిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందన్నారు.