తెలంగాణలో బీజేపీ బలపడుతున్న సమయంలో పాలమూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఒక నోట్ ను విడుదల చేశారు. అనివార్య కారణాల వల్ల తాను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజీనామాకు సంబంధించిన విషయాన్నిత్వరలో చెబుతానని తెలిపారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు పాలమూరు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎర్ర శేఖర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఆ తరువాత రాజీనామాను ప్రకటించారు.