నన్ను కొనేవారు ఇంకా పుట్టలేదు: అసదుద్దీన్ ఓవైసీ

‘నన్నుడబ్బుతో కొనేవారు ఇంకా భూమి మీద పుట్టలేదు’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఆ రాష్ట్రంలో పోటీ చేయడానికి సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లిం ఓట్లను విభజించడానికి బీజేపీ కొన్ని కోట్లను ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి నేతలను రప్పిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ సీఎం మమతా […]

Written By: Suresh, Updated On : December 16, 2020 2:13 pm
Follow us on

‘నన్నుడబ్బుతో కొనేవారు ఇంకా భూమి మీద పుట్టలేదు’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఆ రాష్ట్రంలో పోటీ చేయడానికి సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లిం ఓట్లను విభజించడానికి బీజేపీ కొన్ని కోట్లను ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి నేతలను రప్పిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ సీఎం మమతా వ్యాఖ్యలు నిరాధారమని, ఆమె తన పార్టీ గురించి తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. చాలా మంది నేతలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారన్నారు.