Site icon OkTelugu

మరో ప్రేమ జంట ఆత్మహత్య

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యలకు పాల్పడడం సాగుతోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజు తండ గ్రామానికి చెందిన గూగులోతు వెంకటేశ్, భూక్య ప్రవీణలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజులుగా వీరిద్దరు కనిపించకపోవడంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దీంతో తండా శివారు ప్రాంతలోని వ్యవసాయ బావిలో వీరిద్దరు మ్రుతదేహాలను గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మ్రుతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మహబూబా ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజుల కిందట వరంగల్ సమీపంలోనూ బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version