తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 617 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,82,347 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,518గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,74,260 మంది కోలుకోగా ప్రస్తుతం 6,569యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 4,400 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 45,227 కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.