
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,708 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,14,792 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,233గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 1,89,351 మంది కోలుకోగా ప్రస్తుతం 24,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్లో రికవరీ రేటు 86.8 శాతం ఉండగా తెలంగానలో 88.15 శాతంగా ఉంది. ఇక నిన్న 46,835 పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 36,24,096 పరీక్షలు చేశారు.