Samsung: శ్యాంసంగ్ నుంచి కొత్త మొబైల్.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

Samsung: ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శ్యాంసంగ్ నుంచి లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త మొబైల్ మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మొబైల్ లో ఉండే ఫీచర్స్, ధరను చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు.

Written By: Srinivas, Updated On : June 24, 2024 3:37 pm

samsung galaxy s24 ultra

Follow us on

Samsung: కాలం మారుతున్న కొద్దీ మొబైల్ టెక్నాలజీ మారుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శ్యాంసంగ్ నుంచి లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త మొబైల్ మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మొబైల్ లో ఉండే ఫీచర్స్, ధరను చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. మరి ఈ మొబైల్ గురించి వివరాల్లోకి వెళితే..

శ్యాంసంగర్ కంపెనీ నుంచి కొత్తగా గెలాక్సీ ఎస్ 24ను విడుదల చేశారు. ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికొస్తే 6.8 అంగుళాల డైనమిక్ డిస్ ప్లేను కలిగి ఉంది. 120 Hz రిప్రెష్ రేట్ సపోర్ట్, గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్ తో కూడుకొని ఉంది. 8 జనరేషన్ 3 ప్రాసెస్ ను కలిగిన ఇందులో 12 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజీ సదుపాయం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ UI6.1 తో పనిచేస్తుంది. 10 మెగా పిక్సెల్ నార్మల్, 10 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్స్ లో లెన్స్ తీసుకోవచ్చు. సెల్పీ 12 మెగా ఫిక్సెన్ కెమెరా ఉంది.

గెలాక్సీ ఎస్ 24లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ చార్జింగ్ తో పనిచేస్తుంది. వైర్ లెస్ చార్జింగ్ తో పాటు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ను వేరియంట్ ను బట్టి ధరను నిర్ణయించారు. 12 జీబి రామ్ తో పాటు 256 జీబీ స్టోరేజీ ధర రూ.1,29,999తో విక్రయిస్తున్నారు. 12 జీబి ర్యామ్ తో పాటు 512జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1.39, 999 విక్రయిస్తున్నారు. టాప్ వేరియంట్ రూ.1,59,999గా ఉంది.