Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీHimalayas : మండే ఎండకు మనుషులే కాదు.. హిమాలయాలూ కరుగుతున్నాయి.. షాక్ ఇస్తున్న ఇస్రో తాజా...

Himalayas : మండే ఎండకు మనుషులే కాదు.. హిమాలయాలూ కరుగుతున్నాయి.. షాక్ ఇస్తున్న ఇస్రో తాజా ఫోటోలు..

Himalayas : ఎండలు దంచి కొడుతున్నాయి. అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. కేవలం వేసవికాలం మాత్రమే కాదు, వానా కాలంలోనూ కొద్దిరోజులు మినహా అన్ని రోజులు ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతున్నాయి. దీనంతటికీ కారణం పెరుగుతున్న భూతాపం. ఈ భూతాపం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు పెరిగి హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయట. ఇది ఎప్పటినుంచో మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో హిమాలయాలు కరిగిపోవడం తీవ్రతరమైంది. ఫలితంగా కొత్త కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. ఉన్న సరస్సులు మరింత విస్తరించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.

గత 39 సంవత్సరాల నుంచి భూమ్మీద విపరీతంగా సరస్సులు విస్తరిస్తున్నాయి. ఇస్రో ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదికకు ఇస్రో “శాటిలైట్ ఇన్ సైట్స్.. భారత హిమాలయాల్లో విస్తరిస్తున్న సరస్సులు” అని పేరు పెట్టింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి 2,431 సరస్సులు గుర్తించింది. ఇందులో 601 సరస్సులు రెండు రెట్ల కంటే ఎక్కువ విస్తరించాయి. పది సరస్సులు పరిమాణం కంటే ఒకటిన్నర నుంచి రెండు రెట్లు పెరిగాయి. 65 సరస్సులు ఒకటిన్నర రెట్లు విస్తరించాయి. గత 38 ఏళ్లలో వీటి పరిమాణం రెట్టింపయింది.. 1984 నుంచి 2023 వరకు భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షించే దీర్ఘకాలిక ఉపగ్రహాలు తీసిన ఫోటోల ద్వారా ఇస్రో ఈ నివేదిక వెలువరించింది.

హిమాలయ పర్వతాల్లో 2,431 సరస్సుల్లో.. పదిహేటార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే 676 సరస్సులు భారీ స్థాయిలో విస్తరించాయి. ఇందులో 130 సరస్సులు భారతదేశంలోనే ఉన్నాయి. సింధు నది పరివాహక ప్రాంతంలో 65, గంగా నది పరివాహక ప్రాంతంలో ఏడు, బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో 58 సరస్సులున్నాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో 314 సరస్సులు నాలుగువేల నుంచి 5000 మీటర్ల పరిధిలో ఉన్నాయి. 296 సరస్సులు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 4,068 మీటర్ల ఎత్తు ఉండే గేపాంగ్ ఘాట్ గ్లేసియల్ సరస్సు అనేక మార్పులకు గురైంది. ఇది 178% విస్తరించింది. సంవత్సరానికి దీని పెరుగుదల 1.96 హెక్టార్లుగా ఉంది.

హిమాలయ పర్వతాలు కరగడం వల్ల ఏర్పడిన సరస్సులు మంచినీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మంచి వెనుక చెడు ఉన్నట్టు ఇవి ” గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్” వంటి ప్రమాదాలకు కారణమవుతాయి. పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురువక పోయినప్పటికీ ఈ నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. మామూలు వర్షాలు కురిసినా తీవ్రమైన వరదలు సంభవిస్తాయి. దీనంతటికీ పారిశ్రామిక విధానాలు, పెరిగిపోతున్న కాలుష్యం, చెట్లను నరకడమే ప్రధాన కారణాలని ఇస్రో చెబుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper