Maharastra – Sangli District : అది ఓ మారుమూల పల్లె.. అయితేనేం పట్టణంలో ఉన్నట్లే అక్కడా మొబైళ్లు ఉన్నాయి… అక్కడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ వినియోగం తక్కువే. ఎందుకంటే.. వ్యవసాయం, ఇతర కూలీనాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వారికి ఫోన్తో కాలక్షేపం చేసే తీరిక దొరకదు. పనిలో నిమగ్నమయ్యాక ఫోన్పై ధ్యాసే ఉండదు. కానీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నేటితరం మాత్రం అలా కాదు.. టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఆన్డ్రాయిడ్ ఫోన్లకు బానిసవుతోంది. పట్టణం, గ్రామం అని తేడా లేకుండా మొబైల్ ఫోన్లలో ముగినితేలుతోంది. తమ పిల్లల్లో ఈ పరిస్థితిని గమనించిన ఆ మారుమూల పల్లె ప్రజలు ఓ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలన ఫోన్లకు దూరంగా ఉంచేందుకు ఓ ఉపాయం చేశారు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఇంతకి ఆ పల్లె ఎక్కడుంది.. వారు ఏం చేశారు.. పిల్లల్లో ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసుకుందాం…