టీమిండియా ఓటమికి కారణమేంటి?

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ క్రికెట్ జట్టు ఓడిపోయింది. పేలవ ప్రదర్శన చేశామని, బౌలర్లు రాణించలేదని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. కానీ కోహ్లీ పదే పదే అవే తప్పులు చేసి భారత్ ఓటమికి కారణం అయ్యాడు. తొలి వన్డేలో భారీ పరుగులు సమర్పించుకున్న పేసర్‌ నవదీప్‌ సైనీని రెండో వన్డేలో చాన్స్ ఇచ్చాడు కోహ్లి. కానీ మ్యాచ్ లో సైనీ దారుణంగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కనీసం నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లలో ఒకరి మూడో […]

Written By: NARESH, Updated On : November 30, 2020 12:21 pm
Follow us on

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ క్రికెట్ జట్టు ఓడిపోయింది. పేలవ ప్రదర్శన చేశామని, బౌలర్లు రాణించలేదని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. కానీ కోహ్లీ పదే పదే అవే తప్పులు చేసి భారత్ ఓటమికి కారణం అయ్యాడు. తొలి వన్డేలో భారీ పరుగులు సమర్పించుకున్న పేసర్‌ నవదీప్‌ సైనీని రెండో వన్డేలో చాన్స్ ఇచ్చాడు కోహ్లి. కానీ మ్యాచ్ లో సైనీ దారుణంగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కనీసం నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లలో ఒకరి మూడో స్పెషలిస్టు పేసర్‌గా తీసుకుంటారని అనుకున్నా అది జరగలేదు.

Also Read: విరాట్, రోహిత్ మధ్య వివాదం నడుస్తోందా.?

సైనీని మళ్లీ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆడేసుకోవడంతో పూర్తిగా కోటాను వేయలేకపోయాడు సైనీ. నవదీప్‌ సైనీని ఆదిలోనే బాదేయడంతో అతన్ని 34 ఓవర్‌ వేసిన తర్వాత కోహ్లి ఆపేశాడు. ఆపై అతనికి చివరి ఓవర్‌ వేసే అవకాశాన్ని మాత్రమే ఇచ్చాడు కోహ్లి. అంటే ఒక స్పెషలిస్టు పేసర్‌ చేత పూర్తిగా బౌలింగ్‌ వేయించే పరిస్థితి ఇక్కడ లేకుండా పోయింది.

* హర్దిక్‌ను లేట్‌ చేశాడు..
హార్దిక్‌ పాండ్యాకు వెన్నుగాయం తర్వాత బౌలింగ్‌ చేయడం ఇదే తొలిసారి. ఎప్పుట్నుంచో దూరంగా ఉంటున్న హార్దిక్‌.. ఆసీస్‌తో రెండో వన్డేలో బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేసిన హార్దిక్‌ 24 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. కానీ హార్దిక్‌కు బౌలింగ్‌ ఇచ్చే విషయంలో చాలా ఆలస్యం చేశాడు కోహ్లి.

Also Read: ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్..!

హార్దిక్‌ చేతికి 36 ఓవర్‌లో బౌలింగ్‌ ఇచ్చా డు.ఆరు పరుగుల ఎకానమీతో ఆకట్టుకున్న హార్దిక్‌.. స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ను ఖాతాలో వేసు కున్నాడు. ఒకవేళ హార్దిక్‌ చేత ముందే బౌలింగ్‌ వేయించుంటే పరిస్థితి మరోలా ఉండేది. తొలి వన్డేలో హార్దిక్‌ చేత బౌలింగ్‌ చేయించలేకపోయమని బాధపడిన కోహ్లి.. ఈ మ్యాచ్‌లో అతడి చేత నాలుగు ఓవర్లే వేయించడమే ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు కోసం: క్రీడలు

ఈ మ్యాచ్‌లో బుమ్రా, షమీ, సైనీ, రవీంద్ర జడేజా, చహల్‌, హార్దిక్‌ పాండ్యాలతో పాటు మయాంక్‌ అగర్వాల్‌ కూడా బౌలింగ్‌ చేశాడు. ప్రధానంగా కోహ్లి బౌలింగ్‌ను తరచు మార్చుతూ కనిపించాడు. మ్యాచ్‌ మధ్య భాగంలో బౌలర్ల చేత కంటిన్యూ స్పెల్‌ చేయించకుండా మార్చి మార్చి బౌలింగ్‌ వేయించి ఆసీస్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కోహ్లి. కానీ బెడిసి కొట్టింది. దీంతో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కాగా, మూడు వన్డేల సిరీస్ లో భాగంగా కాన్ బెర్రా వేదికగా నామమాత్రపు చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ జట్లు లోపాలను అధిగమించి గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.