Vaibhav Suryavanshi: సాధారణంగానే అతడు ఒక టెంపో లో ఉంటాడు. బంతిని బలంగా కొడతాడు. ఏ మాత్రం అవకాశం వచ్చినా సరే బంతిని వేగంగా ఎక్కడికి తరలించాలో అక్కడికే తరలిస్తూ ఉంటాడు. అతడికి బౌలింగ్ వేయాలంటేనే చాలామంది భయపడుతుంటారు. బుమ్రా లాంటి బౌలర్ల బౌలింగ్ లోనే తొలి బంతిని సిక్సర్ కొట్టిన చరిత్ర అతడిది. అటువంటి ఆటగాడిని గెలికితే ఎలా ఉంటుంది.. లంకకు తెలియదు.. అతడు ఎంత ప్రమాదకారో..
ఆదివారం ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ జట్ల మధ్య ట్రై సిరీస్ ఫైనల్ జరగబోతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుమీద శ్రీలంక విజయం సాధించింది. భారత అభిమానులు కూడా ఇదే కోరుకున్నారు. ఎందుకంటే ఫైనల్ లో సూర్య బ్యాటింగ్ డిస్ప్లే చూడాలని వారు ఆసక్తితో ఉన్నారు. అందువల్లే శ్రీలంక విజయం సాధించాలని ఆకాంక్షించారు. వారి ఆకాంక్షకు గట్టిగానే శ్రీలంక ఫైనల్లోకి వచ్చింది. దీంతో వైభవ్ సూర్య వంశీ ఫైనల్ లో వారికి దేత్తడి పోచమ్మ గుడిని చూపించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నిరాశతో ఉన్న వైభవ్ సూర్య వంశీని శ్రీలంక ప్లేయర్లు రెచ్చగొట్టారు. అడ్డగోలుగా మాట్లాడారు. మనవాడు ఊరుకునే రకం కాదు కదా.. రెచ్చిపోయాడు. శ్రీలంక ఆటగాళ్లకు తగిన సమాధానం చెప్పాడు. దీంతో అక్కడ గొడవ జరిగింది. అయితే సూర్య వంశీ గెలికితే గెలికించుకునే రకం కాదు. అంతు చూసే రకం. అసలే 15 ఏళ్ల బుడ్డోడిలా కాకుండా.. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా అతను ఆడుతుంటాడు. అలాంటప్పుడు శ్రీలంక జట్టు బౌలర్లను ఎందుకు వదిలిపెడతాడు..
ఫైనల్ మ్యాచ్లో అతడు గనుక రెచ్చిపోతే శ్రీలంక అన్ని మూసుకోవడం ఖాయం. ఐపీఎల్ లో.. అంతకుముందు అండర్ 19 వరల్డ్ కప్ లో సూర్య తన ప్రతాపం చూపించాడు. ఈ సిరీస్ లో ఇంతవరకు వైభవ్ తన స్థాయి ఆట తీరు ప్రదర్శించలేదు. అతడు గనుక ఒకసారి టచ్ లోకి వస్తే శ్రీలంక ప్లేయర్లకు దబిడి దిబిడే అంటూ టీమిండి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి సూర్య వంశీ ఏ స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడో.
